భారతదేశం, మే 24 -- తిరుమలలో వరుసగా అపచారాలు చోటుచేసుకుంటున్నాయి. తిరుమలలో ఓ వ్యక్తి నమాజ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా పలువురు కానిస్టేబుళ్లు మద్యం తాగి తిరుమలకు వచ్చారని ప్రచారం జరుగుతోంది.

కర్నూలుకు చెందిన కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ మద్యం మత్తులో అతివేగంతో వాహనం నడుపుతూ ఘాట్ రోడ్డులో ఆక్సిడెంట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ముగ్గురు కానిస్టేబుళ్లు మద్యం మత్తులో తిరుమలకు వచ్చారు. ఘాట్‌ రోడ్డులో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి పలు వాహనాలను ఢీకొట్టారు. పలువురు భక్తులను ఇబ్బందులకు గురిచేశారు.

విషయం తిరుమల పోలీసులకు తెలియడంతో కానిస్టేబుళ్లను స్టేషన్‌కు తరలించారు. అనంతరం వీరికి డ్రంక్‌ డ్రైవ్‌ టెస్ట్‌ నిర్వహించగా 300 పాయింట్లు చూపించినట్లు తెలుస్తోంది.

తిరుమల కల్యాణ వేదిక సమీపంలో అన్...