భారతదేశం, మే 24 -- టీటీడీలో మ‌రింత పార‌ద‌ర్శకంగా సాంకేతిక సేవ‌లు అమ‌లు చేయ‌నున్నట్లు టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు వెల్లడించారు. తిరుమ‌ల‌లోని అన్నమ‌య్య భ‌వ‌న్ లో శ‌నివారం ఉద‌యం డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా టీటీడీ చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీటీడీ ఈవో వెల్లడించారు.

* వేస‌వి నేప‌థ్యంలో తిరుమ‌ల‌, టీటీడీ స్థానిక ఆల‌యాల్లో భ‌క్తుల సౌక‌ర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టారు.

* భ‌క్తులు ఎండ తీవ్రతకు ఇబ్బంది ప‌డ‌కుండా ఆల‌య మాడ వీధుల్లో చ‌లువ పందిళ్లు, కూల్ పెయింట్, నిరంత‌రాయంగా నీటిని పిచికారి చేస్తున్నారు.

* ర‌ద్దీ ప్రాంతాల్లో, క్యూలైన్లలో తాగునీరు, మ‌జ్జిగ విరివిగా పంపిణీ చేస్తున్నారు.

* తిరుప‌తిలో శ్రీ‌నివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ ల‌లో ద‌ర్శన టోకెన్ల కోసం వేచి ఉండే భ‌క్తుల‌కు మంచినీరు, మ‌జ్...