భారతదేశం, మే 20 -- తిరుపతిలో విద్యార్థుల మధ్య జరిగిన ఓ వ్యక్తిగత గొడవను టీడీపీపై రుద్ది పబ్బం గడుపుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చూస్తున్నారని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. దళిత సోదరులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

ఈనెల 15వ తేదీ రాత్రి తిరుపతిలో జేమ్స్ అనే దళిత విద్యార్థిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన ఘటనకు సంబంధించి ఆయన ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం A1 యశ్వంత్, A-2 కిరణ్, A-3 జగ్గ, A-4 లలిత్, A-5 సాయి గౌడ్, A-6 వంశీ, A7 రూపేష్ ఇంకా మరికొందరు నిందితులుగా పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు.

నిందితుల్లో జగదీష్ అలియాస్ జగ్గ, లలిత్ అలియాస్ లలిత్ గోపాల్, నాని, సాయి గౌడ్ లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులని మంత్రి లోకేశ్ తెలిపారు. ఉండు రూపేష్ రెడ్డి అలియాస్ రూపి, సాయి కిరణ్ కుమార్ రెడ్డి భూమన అభినయ్ రెడ్డి వద్ద పనిచేసే వారని, ...