భారతదేశం, ఫిబ్రవరి 24 -- తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక చర్చను నిర్వహించింది. ఈ అంశం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. పవిత్రమైన సంప్రదాయం వివాదాస్పదంగా మారిందని తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ దేవాదాయ శాఖ మంత్రి రాంనారాయణ రెడ్డి చర్చను ప్రారంభించారు.

'పవిత్ర ఆలయ ప్రసాదం స్వచ్ఛతను వివరించాల్సిన పరిస్థితి తలెత్తడం విచారకరం. సామాన్యులకు అందించే లడ్డూను కల్తీ చేయడం భక్తులను బాధపెడుతుంది.' అని మంత్రి రాంనారాయణ రెడ్డి అన్నారు.

ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ హయాంలో తిరుపతి ఆలయానికి 20 కోట్లకు పైగా లడ్డూలను తయారు చేయడానికి దాదాపు 60 లక్షల కిలోల నెయ్యిని ఉపయోగించారని చంద్రబాబు నాయుడు తెలిపారు. సిండికేట్లు ప్రసాదం నాణ్యతలో రాజీ పడటం ద్వారా అపవిత్రత చేశాయని, తద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని అ...