Hyderabad, మే 19 -- తిన్నది పూర్తిగా అరిగితేనే అందులోని పోషకాలు మన శరీరానికి చేరుతాయి. తిన్న ఆహారం అరగకపోతే పొట్ట అసౌకర్యంగా ఉంటుంది. అజీర్తి సమస్య ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది. అజీర్తితో, అజీర్ణంతో బాధపడే వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇలాంటివారు ప్రతిరోజు కాసేపు హలాసనం వేయడానికి ప్రయత్నించాలి. యోగాలోను హలాసనం ఒక ముఖ్యమైన భంగిమ.

హలాసనం వేయడం వల్ల పొట్ట, పేగు ప్రాంతాలకు మసాజ్ చేసినంత ఫలితం దక్కుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సజావుగా జీర్ణం అవుతుంది. మలబద్ధకం అంటే సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి ఎవరైతే తిన్నది అరగక ఇబ్బంది పడుతున్నారో వారు హలాసనం వేయడం అలవాటు చేసుకోవాలి.

అజీర్తి సమస్యను తీర్చడమే కాదు... హలాసనం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థలో రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా ఈ హలాసనం ప్రేరేపిస్త...