భారతదేశం, ఏప్రిల్ 13 -- ముంబైలో 26/11 ఉగ్రదాడి సూత్రధారి తహవూర్ హుస్సేన్ రాణాను భారత్ తీసుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఆయన తరఫు న్యాయవాది జాన్ జి క్లైన్ అతడిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఈ అప్పీలును తోసిపుచ్చింది. రాణా ఆరోగ్యం, భారతదేశంలో చిత్రహింసలకు అవకాశం ఉందని పేర్కొంటూ దీనిని ఆపాలని కోరుతూ న్యాయవాది.. విదేశాంగ మంత్రి మార్కో రుబియోకు లేఖ రాశారు.

ఈ లేఖలపై స్పందించిన రుబియో కార్యాలయం రాణాను భారత్‌కు పంపాలనే నిర్ణయం ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్‌కు కట్టుబడి ఉందని తెలిపింది. అతడిని భారత్‌కు పంపడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా కోర్టు కూడా సమర్థించిందని పేర్కొంది.

జనవరిలో యూఎస్ ...