Hyderabad, సెప్టెంబర్ 30 -- తెలుగులోకి మరో తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ కొత్త వెబ్ సిరీస్ పేరు 'కుట్రం పురిందవన్'. ఇది తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇప్పటి వరకూ వచ్చిన చాలా వరకు తమిళ థ్రిల్లర్ సిరీస్ లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ కొత్త సిరీస్ పైనా భారీ అంచనాలు ఉన్నాయి.

తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్వరలో ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. పశుపతి లీడ్ రోల్‌లో నటించిన ఈ ఇంటెన్స్ థ్రిల్లర్.. త్వరలో సోనీ లివ్, ఓటీటీప్లే ప్రీమియంలలో అందుబాటులోకి రానుంది. 'కుట్రం పురిందవన్: ది గిల్టీ వన్' అనే ఈ కొత్త సిరీస్‌కు సంబంధించి సోనీ లివ్ మంగళవారం (సెప్టెంబర్ 30) ఒక గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది.

దీని ట్యాగ్‌లైన్ 'ఎ టేల్ ఆఫ్ గిల్ట్, సీక్రెట్స్ అండ్ కాన్సీక్వెన్సెస్' అని ఉంది. ఇది త్వరలో ఆ ప్లాట్‌ఫామ్‌ల...