భారతదేశం, జనవరి 5 -- నటి సమంత రూత్ ప్రభు, ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లో జరిగిన యోగిక్ వివాహ వేడుకలో ఒక్కటయ్యారు. తమ పెళ్లి తర్వాత వారు తమ స్నేహితుల కోసం ఇంట్లో ఒక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో నటి తమన్నా భాటియా కూడా పాల్గొనడం విశేషం. ఆ సాయంత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన క్రిస్మస్ ట్రీ, డెకరేషన్ కు సంబంధించిన ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ.. "నేను నిజంగానే ఈ క్రిస్మస్ డెకరేషన్‌ని పక్కన పెట్టాలా" అని రాసుకొచ్చింది. ఆ ఫోటోలో ఆమె తన ఇంటికి క్రిస్మస్ కోసం అందంగా అలంకరించింది.

ఆమె షేర్ చేసిన మరో ఫోటోలో.. సమంత, ఆ క్రిస్మస్ ట్రీ ముందు నిలబడి ఫోటోలకు పోజులివ్వడం చూడవచ్చు. వారితో పాటు తమన్నా, వారి ఇతర స్నేహితులు కూడా ఉన్నారు. అది ఇంట్లో ...