భారతదేశం, మే 3 -- గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామ శివారు లక్ష్మణ్ తండాకు చెందిన వాంకుడోత్ కృష్ణమూర్తి.. ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. మండలంలోని ఆదివారంపేట గ్రామంలోని తన బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండగా.. బుధవారం ఉదయం తన ఆరేళ్ల కొడుకు వాంకుడోత్ జాన్ పాల్ ను తీసుకుని వెళ్లాడు. అక్కడ ఫంక్షన్ కు అటెండ్ అయిన తరువాత.. అదే రోజు మధ్యాహ్నం తన కొడుకును తీసుకుని రిటర్న్ అయ్యాడు.

ఆటోలో తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో నిద్ర రావడంతో ఆటోను రోడ్డు పక్కన ఆపి పడుకున్నాడు. లేచి చూసేసరికి బాలుడు కనిపించడం లేదు. దీంతో తన కొడుకు తప్పిపోయాడని అదే రోజు సాయంత్రం కృష్ణమూర్తి గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ వైపు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వగా.. మరోవైపు కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. గురువారం వరకు వెతికినా ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదు.

ఈ క్రమంలోనే ...