భారతదేశం, మే 19 -- ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం దెబ్బకు పాక్ భయపడింది. అయితే ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్థాన్ కోసం చైనా భారత్‌పై గూఢచర్యం చేసిందని ఒక షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. శాటిలైట్ డేటాను కూడా పంచుకుందని తెలిసింది. రక్షణ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న 'సెంటర్ ఫర్ జాయింట్ వార్‌ఫేర్ స్టడీస్' నివేదికలో రెండు ప్రధాన విషయాలు వెల్లడయ్యాయి. రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణలు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇప్పుడు థర్డ్ పార్టీ అంటే చైనా పాత్రపై నివేదిక రావడం గమనార్హం.

పాకిస్థాన్‌ను గెలిపించడానికి చైనా అన్ని ప్రయత్నాలు చేసిందని, కానీ ఈ రెండింటి బంధం భారత సైన్యం బలం ముందు నిలబడలేకపోయిందని నివేదిక బహిర్గతం చేసింది. సైన్యం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా కచ్చితమైన దాడుల్లో అనేక మంది పెద్ద ఉగ్రవాదులను హతమార్చింది.

భారత సైనిక మోహరింపును పర్యవ...