భారతదేశం, ఫిబ్రవరి 22 -- నిహారిక కొణిదెల సంచలన పోస్టు పెట్టింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ 2026 ఈవెంట్ ఆర్గనైజర్లపై మండిపడింది. డెబ్యూ విన్నర్స్ కు స్టేజీపై మాట్లాడే ఛాన్స్ ఇవ్వరా? అని ప్రశ్నించింది. ఒక్క నిమిషం దొరకలేదా? అని అడిగింది. ఈ పోస్టు వైరల్ గా మారింది.

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ 2026 ఈవెంట్ కేరళలోని కొచ్చిలో ఘనంగా జరిగింది. కానీ ఈ ఈవెంట్ జరిగిన తీరు పట్ల నిహారిక కొణిదెల నిరాశ వ్యక్తం చేసింది. తన మనసులోని మాటను నిర్మొహమాటంగా పంచుకుంది. ఆదివారం (ఫిబ్రవరి 22) ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టింది.

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ 2026 ఈవెంట్ లో డెబ్యూ అవార్డులు గెలిచిన వాళ్లకు స్టేజీపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై నిహారిక ఫైర్ అయింది.

''ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఇండియన్ సినిమా టాలెంట్ ను గుర్తించడం ఎప్పుడూ ప్రత్యేకమే. అద్భుతమైన ...