భారతదేశం, మే 6 -- డీఎస్సీ పరీక్షలు నిర్వహించే కేంద్రాలతోపాటు.. టీసీఎస్, ఆయాన్ సెంటర్లలో కంప్యూటర్లు, ఇతర సదుపాయాలు కల్పించాలని.. మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. డీఎస్సీ కాల్ సెంటర్లలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. టెట్ పరీక్షల్లో అర్హతలే డీఎస్సీలో కూడా ఉంటాయన్నారు. అభ్యర్థుల విజ్ఞప్తిమేరకు సర్టిఫికెట్ల అప్ లోడింగ్ కు ఆప్షన్ సౌకర్యం కల్పించామని చెప్పారు. వెరిఫికేషన్ నాటికి సర్టిఫికెట్లు సమర్పిస్తే.. సరిపోతుందన్నారు.

ఇటీవల విడుదల చేసిన పదోతరగతి పరీక్షా ఫలితాలపై మంత్రి లోకేష్ సమీక్షించారు. 'ఇక నుంచి అకడమిక్స్ పై దృష్టిసారించాలి. వచ్చేఏడాది మెరుగైన ఫలితాల సాధనకు కృషిచేయాలి. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని.. వన్ క్లాస్ వన్ టీచర్ ప్రాతిపదికన జీఓ 117కి ప్రత్నామ్నాయం రూపొందించాం. పదోతరగతి పరీక్ష...