భారతదేశం, మే 4 -- తెలంగాణ రాష్ట్రంలో డీఈడీ కోర్సుకు మళ్లీ డిమాండ్‌ పెరుగుతోంది. డీఈఈసెట్‌కు గత ఏడాదే దరఖాస్తుల సంఖ్య పెరగ్గా, ఈసారి పోటీపడే వారి సంఖ్య రెట్టింపునకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండేళ్ల డీఈడీ చదివాక టెట్‌ పాసైతే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీ కొలువులకు సులభంగా ఎంపిక కావొచ్చన్న అభిప్రాయం ఉంది. దీంతో ఈసారి డీఈఈసెట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేస్తున్నారు. ఇంకా 15 రోజులు గడువు ఉండగానే గతేడాది కంటే 8 వేల 345 దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి.

సెకండరీ గ్రేడ్ టీచర్ కొలువులకు డీఈడీతో పాటు బీఈడీ అభ్యర్థులు కూడా పోటీ పడొచ్చని.. 2018లో జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి డీఈఈసెట్‌కు డిమాండ్‌ తగ్గింది. దీంతో తెలంగాణలో ప్రైవేట్‌ డీఈడీ కళాశాలల సంఖ్య 219 నుంచి 79కి తగ్గిపోయింది. సీట్ల సంఖ్య 11 వేల 250 నుం...