భారతదేశం, ఆగస్టు 4 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ను 2025 డిసెంబరు నాటికి వ్యర్థ రహిత రాష్ట్రంగా మారుస్తామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ సోమవారం ప్రకటించారు. కొత్తగా పేరుకుపోయిన 20 లక్షల టన్నుల వ్యర్థాలను అక్టోబరు నాటికి, గత ప్రభుత్వం వదిలి వెళ్లిన 85 లక్షల టన్నుల వ్యర్థాలను డిసెంబరు నాటికి తొలగిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి నారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. నగరాలను పరిశుభ్రంగా ఉంచాలంటే ప్రజల సహకారం, అవగాహన చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీగా పేరుకుపోయే వ్యర్థాలను విశాఖపట్నం, గుంటూరులోని వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లకు తరలిస్తున్నామని మంత్రి చెప్పారు. వీటితోపాటు కొత్తగా కడప, కర్నూలు, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.