భారతదేశం, మే 19 -- భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన తర్వాత మార్కెట్లో రక్షణ రంగ స్టాక్స్ బలపడటం ప్రారంభించాయి. రక్షణ రంగ స్టాక్‌ల మాదిరిగానే రైల్వే స్టాక్‌లు కూడా పెరుగుతున్నాయి. దీనికి ముందు రైల్వే స్టాక్స్ పనితీరు తక్కువగా ఉంది. ఇప్పుడు రైల్ వికాస్ నిగమ్, ఆర్ఐటీఈఎస్, బీఈఎంఎల్, ఐఆర్‌సీటీసీ, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు మే నెలలో మంచి రాబడిని ఇచ్చాయి.

రైల్వే స్టాక్‌లు మే 2023 నుండి జూలై 2024 వరకు నిరంతరం పెరిగాయి. కానీ ఆ తర్వాత ఈ స్టాక్‌లు రికార్డు గరిష్టాల నుండి అటుఇటుగా వెళ్లాయి. కానీ ఇటీవల ఆర్డర్ పెరగడం వల్ల రైల్వే స్టాక్‌లపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. రక్షణ రంగ స్టాక్స్‌లో నిరంతర పెరుగుదలతో పాటు, రైల్వే స్టాక్‌లు కూడా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించడం ప్రారంభించాయి....