Telangana, మే 30 -- దోస్త్ - 2025 ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా. అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. నేటి నుంచి సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన విద్యార్థులు.. జూన్ 8వ తేదీ వరకు దోస్త్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

దోస్త్ 2025 సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ కు జూన్‌ 8 వరకు అవకాశం ఉంటుంది. మే 30 నుంచి అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. జూన్‌ 9వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది. జూన్‌ 13న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు.. జూన్ 13వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయవచ్చు. ఈ గడువు జూన్ 18వ తేదీతో పూర్తవుతుంది. కాలేజీలో రిపోర్టింగ్ చేయకపోతే. సీటు రద్దవుతుంది.

ఇక దోస్త్ 3వ విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్‌ 13 ను...