భారతదేశం, మే 26 -- క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్లను సొమ్ము చేసుకునేందుకు కొందరు నేతలు, కొన్ని క్రీడా సంఘాలు ప్రయత్నిస్తున్నాయని ఏపీ ఒలింపిక్ అసోసియేషన్‌ ఆరోపించింది. క్రీడల్లో నకిలీలను తొలగించి.. అసలైన క్రీడాకారులకు న్యాయం చేయాలని, అర్హులకే స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు దక్కాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఏపీ మెగా డిఎస్సీ 3శాతం స్పోర్ట్స్‌ రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో శాప్‌ నిబంధనల తీరుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో డీఎస్సీ క్రీడా కోటా సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌లో క్రీడా సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన జూడో క్రీడ నకిలీ సర్టిఫికెట్‌లపై వెంటనే దర్యాప్తు జరగాలని ఏపీవోఏ అధ్యక్షుడు ఆర్‌.కె.పురుషోత్తం డిమాండ్ చేశారు....