భారతదేశం, నవంబర్ 20 -- గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి జ్యోతి పూర్వాజ్. బుల్లితెర నుంచి వెండి తెరపైకి హీరోయిన్‌గా మారిన జ్యోతి పూర్వజ్‌కు జ్యోతి రాయ్ అనే పేరు కూడా ఉంది. జ్యోతి పూర్వజ్ నటించిన లేటెస్ట్ తెలుగు సినిమా కిల్లర్.

జ్యోతి పూర్వాజ్‌తోపాటు పూర్వజ్, మనీష్ గిలాడ ప్రధాన పాత్రలు పోషించారు. చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మించారు.

ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వజ్ దర్శకత్వం వహించారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్న కిల్లర్ సినిమా నుంచి ఇటీవల ఫైర్ అండ్ ఐస్ సాంగ్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో లాంఛ్ ...