Hyderabad, మే 12 -- డయాబెటిస్ ఉన్న వారు అన్నం తినేందుకు ఎంతో భయపడతారు. ఎందుకంటే అన్నంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఒక పూటే అన్నం తిని రెండో పూట టిఫిన్ తో ముగించేవారు. ఎంతోమంది రాత్రిపూట పూర్తిగా అన్నం తినడం మానేసి చపాతీతోనే కడుపు నింపుకునే వారు కూడా ఉన్నారు. కానీ ఎంతో మందికి అన్నం తింటేనే సంతృప్తిగా అనిపిస్తుంది.

కానీ డయాబెటిస్ వ్యాధి వల్ల వారు అన్నాన్ని సంతృప్తిగా తినలేక పోతున్నారు. అలాంటి వారి కోసమే చక్కెర తక్కువగా ఉండే ఒక బియ్యం రకం ఉన్నాయి. వీటిని తింటే త్వరగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా వీటిని తినవచ్చని అధ్యయనం చెబుతోంది. ఈ బియ్యం రకం పేరు రాజముడి. కర్ణాటకలో వీటిని అధికంగా పండిస్తూ ఉంటారు.

రాజముడి బియ్యం చాలా ప్రత్యేకమైన రుచిని, వాసనను కలిగి ఉంటుంది. పోషక లక్షణాలు కూడా ఎక్కువే. దీని ...