భారతదేశం, జూన్ 9 -- 'డబ్బులు ఊరికే రావు' అంటూ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్​ అయిన వ్యాపారవేత్త ఎం. కిరణ్​ కుమార్​కి చెందిన లలితా జ్యువెలరీ మార్ట్​ లిమిటెడ్​ త్వరలోనే ఐపీఓగా రానుంది. ఈ మేరకు సెబీకి తాజాగా డీఆర్​హెచ్​పీ (డ్రాఫ్ట్​ రెడ్​ హెర్రింగ్​ ప్రాస్పెక్టస్​)ని దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ గురించి, ఐపీఓ వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాము..

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ లలితా జ్యువెలరీ సంస్థ.. బంగారం ఆభరణాల విక్రయాల్లో ప్రత్యేకతను కలిగి ఉంది. వీటితో పాటు వెండి వస్తువులు, వజ్రాల ఆభరణాలను కూడా విక్రయిస్తోంది. ఈ సంస్థ దక్షిణ భారత మార్కెట్‌కు తన సేవలను అందిస్తోంది. టైర్ 1, 2, 3 నగరాల్లో 56 స్టోర్‌లను ఈ సంస్థ ప్రస్తుతం నిర్వహిస్తోంది. ఈ స్టోర్‌లలో బీఐఎస్​ హాల్‌మార్క్ ఉన్న, ప్రామాణికమైన ఆభరణాలను విక్రయిస్తోంది.

ప్రస్తుతం ఉన్న 56 స్ట...