భారతదేశం, సెప్టెంబర్ 15 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 356 పాయింట్లు పెరిగి 81,905 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 108 పాయింట్లు వృద్ధిచెంది 25,114 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 54,809 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 129.58 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,556.02 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ సెప్టెంబర్​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 9244.27 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 27,147.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ ...