భారతదేశం, జూన్ 10 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 256 పాయింట్లు పెరిగి 82,445 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 100 పాయింట్లు వృద్ధిచెంది 25,103 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 261 పాయింట్లు పెరిగి 56,840 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,992.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,503.79 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 25,000 వద్ద కీలక సపోర్ట్​ జోన్​ ఉంది. ఆ లెవల్స్​ పైన ఉన్నంత వరకు ట్రెండ్​ పాజిటివ్​గా ఉన్నట్టు. 25,350-25,400 వద్ద రెసిస్టెన్స్...