భారతదేశం, నవంబర్ 28 -- నథింగ్ కంపెనీ భారతదేశంలో మరొక మిడ్​ రేంజ్​ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. అదే నథింగ్ ఫోన్ 3ఏ లైట్ 5జీ. సరసమైన ధరలోనే అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్న ఈ ఫోన్ గురించి కొన్ని రోజులుగా మంచి బజ్​ నెలకొంది. నథింగ్ సిగ్నేచర్ అయిన గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ స్థానంలో సరికొత్త "గ్లిఫీ లైట్"ను కలిగి ఉంది ఈ స్మార్ట్​ఫోన్​. దీని వల్ల ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త డిజైన్, లుక్‌తో కనిపిస్తుంది. మీరు మంచి స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నట్లయితే, ఈ నథింగ్​ 3ఏ లైట్ ఏం ఆఫర్ చేస్తుందో తెలుసుకోండి.

నథింగ్ ఫోన్ 3ఏ లైట్ 5జీ ప్రారంభ ధర 8జీబీ+128జీబీ వేరియంట్‌కు రూ. 20,999గా ఉంది.

8జీబీ+256జీబీ మోడల్ ధర భారతదేశంలో రూ. 22,999గా ఉంది.

లాంచ్ ఆఫర్‌లలో భాగంగా, నథింగ్ కంపెనీ ఐసీఐసీఐ, వన్‌కార్డ్ బ్యాంక్ డిస్కౌంట్లను కూడా ప్రకటించింది.

ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ డిసెంబర్...