భారతదేశం, ఏప్రిల్ 18 -- సుంకాలకు సంబంధించి అమెరికా, చైనాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం పేర్కొన్నారు. చైనా పలుమార్లు అమెరికా అధికారులను సంప్రదించిందని, ఆ తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలు ప్రారంభమయ్యాయని ట్రంప్ చెప్పారు. రెండు దేశాల మధ్య టారిఫ్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కల్లోలం సృష్టించిన సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం.

అయితే ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తమ వాణిజ్య యుద్ధానికి ముగింపు పలకడానికి ఒక ఒప్పందానికి రాగలవని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ 'అవును, చైనా మమ్మల్ని చాలాసార్లు సంప్రదించింది. వారు మాట్లాడాలనుకుంటున్నారు, మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. కానీ బంతి ఇప్పుడు వారి కోర్టులో ఉంది. చైనాకు అమెర...