భారతదేశం, జూన్ 23 -- ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు స్థావరాలపై అమెరికా దాడి తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. అమెరికా దాడికి తాము బలమైన ప్రతిస్పందన ఇస్తామని ఇరాన్ తెలిపింది. ఇరాన్ మధ్యప్రాచ్యంలోని తమ సైనిక స్థావరాలపై దాడి చేయగలదని అమెరికా భావిస్తోంది.

ఆదివారం తెల్లవారుజామున అమెరికా.. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు.. ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్‌లను నాశనం చేసింది. ఇరాన్ సైన్యానికి కొత్త చీఫ్ అయిన మేజర్ జనరల్ అమీర్ హతామి మాట్లాడుతూ.. 'మేం అమెరికాను చాలాసార్లు ఎదుర్కొన్నా్ం. వారు మనపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా, బలమైన స్పందన వచ్చింది. మన సైనికులలో చాలా మంది అమరులయ్యారు. మేం పూర్తి బలం, ధైర్యంతో పోరాడుతాం.' అని అన్నారు.

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రాచ్యంలోని అమెరికన్ దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప...