భారతదేశం, మే 7 -- టీఎస్‌ ఆర్‌జేసీ సెట్‌ - 2025 హాల్ టికెట్లు వచ్చేశాయ్. ఈ ఎంట్రెన్స్ ఆధారంగా రాష్ట్రంలోని గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలను కల్పిస్తారు. 2025 - 26 విద్యా సంవత్సరానికి గాను సీట్లు కేటాయి స్తారు. ఈ రాత పరీక్ష మే 10వ తేదీన నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసున్న అభ్యర్థులు tgrjc.cgg.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు.

పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందేందుకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తికావటంతో. హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.

రాష్ట్రంలో మొత్తం 35 టీఎస్ఆర్జేసీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 15 బాలురు, 20 బాలికల కాలేజీలు. ఈ ఎంట్రెన్స్ ద్వారా ఇంటర్ ఫస్ట్...