Telangana,hyderabad, మే 24 -- హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 45 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జూన్‌ 5వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది.

ఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే వారు 2025 ఏప్రిల్ 30వ తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ ఉన్నవాళ్లకు వయోపరిమితి విషయంలో సడలింపులు ఉంటాయి. ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, మెషనిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌, టర్నర్‌, షీట్‌ మెటల్‌, వెల్డర్‌, కార్పెంటర్‌, పెయింటర్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

పోస్టును బట్టి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ పాసై ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలి. ...