భారతదేశం, జూన్ 10 -- దేశానికి సేవ చేయాలని కలలు కనేవారికి శుభవార్త. ఇండియన్ ఆర్మీ 2025 రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ కింద 90 కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. జేఈఈ (మెయిన్) 2025కు హాజరైన యువ అభ్యర్థులకు ఈ రిక్రూట్మెంట్ ప్రత్యేకం.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 13 మే 2025 నుండి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 12 జూన్ 2025 మధ్యాహ్నం 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://joinindianarmy.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే అప్లై చేయాలి. వయోపరిమితి విషయానికొస్తే అభ్యర్థుల వయస్సు 16.5 నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే పుట్టిన తేదీ 2 జనవరి 2006-1 జనవరి 2009 మధ్య ఉండాలి.

దరఖాస్తుదారులు ఏ యూపీఎస్సీ పరీక్ష నుండి డిబార్ చేసి ఉ...