భారతదేశం, జూన్ 26 -- జులై 15 నుంచి భారతదేశంలోని ద్విచక్ర వాహనాలు హైవేలపై టోల్ చెల్లించాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. ఎంతో కాలంగా ఫ్రీగా వెళ్తున్న మినహాయింపు టూ వీలర్స్‌కు ఉండదని వార్తలు వచ్చాయి. దీనిపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పందించింది. ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజును ప్రవేశపెట్టడం లేదని, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేశాయని పేర్కొంది.

జూలై 15, 2025 నుండి ద్విచక్ర వాహనాలు హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్ ఫీజు ఉంటుందని ప్రచారం జరిగింది. FASTag ద్వారా డిజిటల్ టోల్ వసూలు వ్యవస్థ పరిధిలోకి ద్విచక్ర వాహనాలను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధాన మార్పును తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోందని వార్తలు వచ్చాయి.

అంతేకాదు ఇప్పుడు FASTag ద్వారా టోల్ వసులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోందని కూడా చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి...