భారతదేశం, ఏప్రిల్ 27 -- 20 ఏళ్ల కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీ చరణి టీమిండియా డెబ్యూ చేసింది. ఆదివారం (ఏప్రిల్ 27) ముక్కోణపు సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డేతో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కొలంబోలో జరిగిన ఈ వర్ష ప్రభావిత మ్యాచ్ లో భారత వుమెన్స్ జట్టు అదరగొట్టింది. టీమిండియా 9 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది.

సెన్సేషనల్ ఫామ్ లో ఉన్న ప్రతీకా రావల్ (62 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు) మరోసారి సత్తాచాటింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను ఇన్నింగ్స్ కు 39 ఓవర్ల చొప్పున నిర్వహించారు.

ఛేజింగ్ లో భారత్ అదరగొట్టింది. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 29.4 ఓవర్లలో 148 పరుగుల టార్గెట్ రీచ్ అయింది. ఏడో వన్డే మాత్రమే ఆడిన ప్రతీక రావల్ ఫామ్ కొనసాగించింది. కెరీర్ లో తొలి ఆరు వన్డే ఇన్నింగ్స్ ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా హిస్టరీ క్ర...