భారతదేశం, మే 26 -- తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కడప వేదిక కానుంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి పురిటిగడ్డపై జరుగుతున్న మహానాడుపై భారీ అంచనాలు ఉన్నాయి. కడపలో మహానాడు నిర్వహించడం ద్వారా రాజకీయ ప్రత్యర్థులకు బలమైన సంకేతాలు ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. టీడీపీ మహానాడులో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

టీడీపీ యువనాయకుడు మంత్రి నారా లోకేష్‌‌కు పార్టీలో మరిన్ని బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే మహానాడులో లోకేష్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట‌్‌గా నియమించేందుకు కసరత్తు జరుగుతోంది.

నారా లోకేష్‌ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడం ప్రారంభించి దశాబ్ద కాలం దాటింది. 2009-14 మధ్య కాలంలో టీడీపీలో లోకేష్‌ ప్రస్థానం మొదలైంది. స్టాన్‌ఫోర్డ్‌లో విద్యాభ్యాసం పూర్తైన త...