భారతదేశం, మే 17 -- టీటీడీ వేద పాఠశాలలో ప్రవేశాలకు 2025 -26 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది.

టీటీడీ ఆధ్వర్యంలో నడుపుతున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠములు (పాఠశాలలు) 1. వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల 2. కీసరగుట్ట, 3. విజయనగరం, 4. ఐ. భీమవరం, 5. నల్గొండ, 6. కోటప్పకొండలో నిర్వహించే వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన బాలుర నుంచి అనగా వైదిక సంప్రదాయం ప్రకారం ఉపనయనం కాబడి, నిర్ణీత వయస్సు, విద్యా ప్రమాణాలు కలిగిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.

ఆయా పాఠశాలల్లో బోధించబడే పలు కోర్సుల వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర వివరాలకు టీటీడీ అధి...