Andhrapradesh,tirumala, జూన్ 1 -- టీటీడీ అనుబంధ కాలేజీల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలవుతున్నాయి. తాజాగా తిరుపతి శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. 2024-25 విద్యా సంవత్సరానికి పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.

జూన్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ కళాశాలలో గాత్రం, వీణ, వేణువు, వయోలిన్‌, నాదస్వరం, డోలు, భరతనాట్యం, కూచిపూడి, నృత్యం, హరికథ, మృదంగం, ఘటం విభాగాల్లో ఫుల్‌టైమ్, విశార‌ద‌(డిప్లొమా), ప్ర‌వీణ‌(అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు ఉన్నాయి. ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో ఫుల్‌టైమ్ స‌ర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు ఉన్నాయి.

జూన్ 27వ తేదీ నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి. ఇత‌ర ప్రాంతాల విద్యార్థుల‌కు హాస్ట‌ల్ వ‌స‌తి క‌ల్పి...