భారతదేశం, డిసెంబర్ 28 -- తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు అలిపిరి మెట్లమార్గం ఏడో మైలు వద్ద కొత్త ప్రథమ చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రసిద్ధ మార్గం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ సౌకర్యం ఏర్పాటు అయింది. ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్ నాయుడు ఈ కేంద్రం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అనారోగ్యానికి గురై అత్యవసర పరిస్థితులు వచ్చిన సమయంలో ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.
దీని వలన అవసరమైన వారికి వైద్య సేవలు త్వరగా లభిస్తాయని టీటీడీ ఛైర్మన్ పేర్కొన్నారు. అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఈ కేంద్రం సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కేంద్రంలో టీటీడీ, అపోలో హాస్పిటల్స్ నుండి వైద్యులు, శిక్షణ పొందిన పారామెడికల్ బృందం మద్దతుతో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.