Telangana, మే 7 -- తెలంగాణ ప్రభుత్వం జూన్ నెలలో టీజీ టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) 2025 ఎగ్జామ్ ను నిర్వహించనుంది. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు టీ - శాట్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉచితంగా శిక్షణ తరగతులను నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.

తెలంగాణ టెట్ 2025 పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు ఉంటుంది. అయితే ఇందులో జనరల్‌ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు సాధిస్తే టెట్ అర్హత సాధించినట్లు అవుతుంది. ఇందులో సాధించే స్కోర్ ఆధారంగా. డీఎస్సీ పరీక్షలో వేయిటేజీ కలుపుతారు.

Published by HT Digital Content Services with p...