Telangana, మే 4 -- ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే టీజీఐసెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా మే 3వ తేదీ నాటికి అప్లికేషన్ల గడువు ముగిసింది. అయితే ఈ గడువును మే 10వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక రూ. 250 ఫైన్ తో మే 17 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ గడువు ముగిస్తే రూ. 500 ఆలస్య రుసుంతో మే 26వ తేదీ వరకు అప్లికేషన్ ప్రాసెస్ కు అవకాశం ఉంటుంది. మే 16వ తేదీ నుంచి అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఏమైనా తప్పులు ఉంటే మే 20 వరకు సవరించుకోవచ్చు.

టీజీ ఐసెట్ - 2025 హాల్ టికెట్లు మే 28వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 8...