Telangana,hyderabad, జూలై 12 -- రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ - 2025 కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ వివరాల ప్రకారం. జూలై 14వ తేదీన కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ను జారీ చేస్తారు. జూలై 21 నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

తెలంగాణ ఎడ్ సెట్ పరీక్షలు జూన్‌ 1వ తేదీన జరిగాయి. మొదటి షెషన్‌ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షను నిర్వహించారు.

ఈసారి జరిగిన ఎడ్‌సెట్‌ కు 38,754 మంది దరఖాస్తు చేసుకోగా 32,106 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 30,944 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 96.38 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా.సీట్ల కేటాయింపు ఉంటుంది.

P...