Telangana,hyderabad, జూలై 26 -- టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అయితే వీరంతా కూడా ఇవాళ్టి నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జూలై 27వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.

అర్హులైన అభ్యర్థులు https://tgeapcet.nic.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి. జూలై 27వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ కు అవకాశం ఉంటుంది. జూలై 30లోపు సీట్ల కేటాయింపు ఉంటుంది.

టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ కింద సీట్లు పొందే అభ్యర్థులు జూలై 30 నుంచి ట్యూషన్ ఫీజు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఈ గడువు ఆగస్టు 1వ తేదీతో పూర్తవుతుంది. కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ కు జూలై 31 నుంచి అవకాశం ఉంటుంది. ఆగస్టు 2వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటా...