Telangana,hyderabad, మే 22 -- గ్రూప్‌-2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన చేసింది. మే 29 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. జూన్‌ 10 వరకు ఈ ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది.

హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లోని సురవరం ప్రతాప్‌ రెడ్డి యూనివర్సిటీ (గతంలో శ్రీ పొట్టి శ్రీరాములు వర్సిటీ)లో గ్రూప్ 2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియను చేపట్టనున్నారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అలాగే.. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.

గ్రూప్ 2 ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచారు. హాల్ టికెట్ నెంబర్లను పేర్కొన్నారు. టీజీపీఎస్సీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం. అభ్యర్థులు వెరిఫికేషన...