Telangana,hyderabad, మే 21 -- టీఎస్‌ ఆర్‌జేసీ సెట్‌ - 2025 రిజల్ట్స్ వచ్చేశాయ్. ఈ ఎంట్రెన్స్ ఆధారంగా రాష్ట్రంలోని గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలను కల్పిస్తారు. 2025 - 26 విద్యా సంవత్సరానికి గాను సీట్లు కేటాయిస్తారు. పరీక్ష రాసిన అభ్యర్థులు tgrjc.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందేందుకు మే 10వ తేదీన ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 35 టీఎస్ఆర్జేసీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 15 బాలురు, 20 బాలికల కాలేజీలు ఉండగా. ఎంట్రెన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి సీట్లను కేటాయిస్తారు.

ర్యాంకులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో...