Andhrapradesh, జూన్ 7 -- రాష్ట్రంలో విద్యాప్రమాణాలను మెరుగుపరుస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, వయోజన విద్య, సమగ్రశిక్ష ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్సీ పరీక్షలపై ఆరా తీశారు.

ఏపీ చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ చేపట్టామని నారా లోకేశ్ చెప్పారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయమన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డీఎస్సీ పరీక్ష ప్రక్రియను ప్రారంభించినట్లు వివరించారు.

రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీపై మంత్రి లోకేశ్ మరో కీలక ప్రకటన చేశారు. ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేస్తామన్నారు. తద్వారా విద్యాప్రమాణాలను మెరుగుపరుస్తామని వివరించారు. అంతిమంగా రాబోయే నాలుగేళ్లలో ఏపీ మోడల...