Telangana,warangal, మే 3 -- సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను బోల్తా కొట్టిస్తూ ఖాతాలన్నీ లూటీ చేస్తున్నారు. ఏళ్లుగా కష్టపడి దాచుకున్న సొత్తునంతా క్షణాల్లో దోచుకుంటున్నారు. తాజాగా హనుమకొండ జిల్లాలో ఓ బీటెక్ విద్యార్థి అకౌంట్ ను ఖాళీ చేశారు. హోటల్స్ కు రేటింగ్ ఇవ్వడంతో పాటు క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెడితే రెట్టింపు చెల్లిస్తామంటూ ఆశచూపి, అతడి అకౌంట్ నుంచి రూ.7.8 లక్షలకుపైగా కొల్లగొట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పులపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు వరంగల్ నగరంలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆ యువకుడికి గత నెల 16న గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. తాము సూచించిన హోటల్స్ కు రేటింగ్ ఇవ్వాలని, అలా చేస్తే డబ్బులు అకౌంట్...