భారతదేశం, మే 24 -- థియేట‌ర్ల బంద్ వ్య‌వ‌హారం టాలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు రిలీజ్ టైమ్‌లోనే థియేట‌ర్ల బంద్ వ్య‌వ‌హారం తెర‌పైకి కావ‌డంత ఇటు రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. థియేట‌ర్ల బంద్ లేదంటూ ఫిలిం ఛాంబ‌ర్ శ‌నివారం ప్ర‌క‌టించింది. ప‌వ‌న్ సినిమాకు అడ్డంకులు సృష్టించాల‌నే థియేట‌ర్ల‌ను బంద్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోన్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌టంతో ఈ వ్య‌వ‌హారంపై ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కందుల దుర్గేష్ విచార‌ణ‌కు ఆదేశించారు.

ఈనేప‌థ్యంలో ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార్యాల‌యం రిలీజ్ చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌లో టాలీవుడ్ ఇచ్చిన రిట‌ర్న్ గిఫ్ట్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. థియేట‌ర్ల ఆదాయంపై ఆరాలు తీయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డ...