భారతదేశం, మే 16 -- తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ సినిమాల ట్రెండ్ కొంత త‌క్కువే. అందులోనూ స్టార్ హీరోలు క‌లిసి న‌టించ‌డం చాలా అరుదు. రేర్ కాంబోలో త్వ‌ర‌లో తెలుగులో ఓ మూవీ రాబోతోంది. ఇద్ద‌రు టాలీవుడ్ టాప్ హీరోలు క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేయ‌బోతున్నారు. సోషియో ఫాంట‌సీ జాన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఈ సోషియా ఫాంట‌సీ మూవీ తెర‌కెక్క‌తోన్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాను హ‌నుమాన్ సినిమా ప్రొడ్యూస‌ర్ నిరంజ‌న్ రెడ్డి నిర్మించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

ఇప్ప‌టివ‌ర‌కు తాను చేసిన సినిమాల‌కు భిన్నంగా ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకొని డైరెక్ట‌ర్ వీఐ ఆనంద్ ఈ మూవీ తెర‌కెక్కిస్తోన్న‌ట్లు తెలిసింది.

ఈ పాన్ ఇండియ‌న్ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టించ‌నున్న‌ టాప్ హీరోలు ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర...