భారతదేశం, మే 15 -- ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తన మిత్రదేశం పాకిస్థాన్‌కు సహకరించిన టర్కీపై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. భారత్‌లోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టర్కీ కంపెనీ సెక్యూరిటీ క్లియరెన్స్‌‌ను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) రద్దు చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా సెలెబి ఏవియేషన్‌కు ఇచ్చిన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది.

సెలెబి నుంచి ప్రకటన రావాల్సి ఉంది. సెలెబి అనేది ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, కన్నూర్, చెన్నై.. ఇలా మెుత్తం తొమ్మిది విమానాశ్రయాల్లో పనిచేసే గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ. విదేశీ విమానయాన సంస్థలు, కార్గో ఆపరేటర్లకు కూడా సెలెబి సేవలను అందిస్తుంది.

టర్కీకి చెందిన సెలెబి ఏవియేషన్ ఇండియాలో...