Hyderabad, జూన్ 10 -- జ్యేష్ఠ పౌర్ణమి 2025 ముహూర్తం: హిందూమతంలో జ్యేష్ఠ పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున నాదీ స్నానం చేసే సంప్రదాయం ఉంది. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం ద్వారా సకల పాపాలు తొలగిపోయి ఆశించిన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున దానం చేయడం వల్ల పూర్వికులు సంతోషించి వారి ఆశీస్సులు ఇస్తారు. ఈ రోజున విష్ణువును, శివుడిని పూజిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ ఎప్పుడు, స్నాన ముహూర్తంతో పాటు పూర్తి వివరాలను తెలుసుకోండి.

పంచాంగం ప్రకారం పౌర్ణమి తేదీ 10 జూన్ 2025 ఉదయం 11:35 గంటలకు ప్రారంభమై 11 జూన్ 2025 మధ్యాహ్నం 01:13 గంటలకు ముగుస్తుంది. కనుక 2025 జూన్ 11న జ్యేష్ఠ పౌర్ణమి జరుపుకోవాలి.

జ్యేష్ఠ పూర్ణిమ నాడు స్నానానికి మంచి సమయం ఉదయం 04:02 నుండి 04:42 వరకు ఉంటుంది. లేదంటే ఉదయం 10.35 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు స్నానం చేయ...