భారతదేశం, మే 2 -- ఐటీ మద్రాస్‌లో బీఎస్ డిగ్రీ కోర్సులో జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్ లేకుండా కూడా ఎంట్రీ కావొచ్చు. ఐఐటీ మద్రాస్ ఈ ప్రత్యేక కోర్సు పూర్తి పేరు బీఎస్ ప్రోగ్రామ్ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్, బీఎస్ ఇన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్. ఈ కోర్సు ఆన్‌లైన్ కోర్సు. ఆన్‌లైన్ విధానంలో అధ్యయనాలు నిర్వహించనున్నారు. కోర్సులో ప్రవేశం కోసం జేఈఈ మెయిన్ లేదా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో స్కోర్ ఉండాల్సిన అవసరం లేదు. దరఖాస్తుకు చివరి తేదీ- 2025 మే 20. study.iitm.ac.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ కోర్సులో జేఈఈ స్కోరు లేకుండా కూడా ఎంట్రీ ఇవ్వొచ్చు. అయితే జేఈఈ మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన విద్యార్థులకు ఇందులో డైరెక్ట్ ఎంట్రీ కూడా లభిస్తుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించనివారు, జేఈఈ మెయిన్ రాయని వారు...