భారతదేశం, జూన్ 4 -- జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. మూడు నెలల విరామం తర్వాత జూలై 21న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలు సమావేశం కానున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ల తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగడం ఇదే తొలిసారి. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసి వాటిని నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. కశ్మీర్ లోని పహల్గామ్ లో 26 మందిని పొట్టనబెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
2025 జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కాగా, ఈ సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ పై ప్రభుత్వం సమగ్ర ప్రకటన చేసే అవకాశం ఉంది. మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.