భారతదేశం, నవంబర్ 14 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్లకుపైగా తేడాతో భారీ విక్టరీని నమోదు చేశారు. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. గాంధీభవన్ లో సందడి వాతావరణం నెలకొంది.

ఈ ఉపఎన్నిక ఫలితంపై ఎన్నికల సంఘం కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనుంది. గెలుపొందిన అభ్యర్థికి ధ్రువీకరణపత్రం అందజేయనుంది. నవీన్ యాదవ్ ఇంటి వద్ద ఆయన అనుచరులు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....