Hyderabad,telangana, మే 23 -- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఫిర్యాదులు అందితే చాలు. క్షేత్రస్థాయి విచారణకు అధికారులు వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు. అక్రమణకు గురైనట్లు తేలితే.. నోటీసులు ఇచ్చి నేలమట్టం చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ పరిధిలోనూ ఆక్రమణలను గుర్తించిన హైడ్రా.. తొలగించింది.

హైడ్రా ప్రకటించిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 41 పెద్దమ్మ గుడికి దగ్గరలోని ఆక్రమణలపై ఫిర్యాదులు అందాయి. ఓ కిరాయిదారుడు నాలాతో పాటు పార్కు రహదారిని ఆక్రమించి అక్రమ కట్టడాలను నిర్మించాడు. ఓనర్ కు తెలియకుండానే ఇదంతా చేశాడు. రోడ్డు, నాలాను ఆక్రమించి హోటళ్లు, హాస్టల్ నడుపుతూ.. నెలకు రూ. 10 లక్షలు అద్దెలు వసూలు చేస్తున్నాడు.

ఈ కిరాయిదారుడి వ్యవహారంపై హైడ్రాకు ఫిర్యాదులు చేరాయి. దీనిపై విచారించిన హైడ్రా. గతంలోనే నో...